30-06-2025 12:29:20 AM
భీమదేవరపల్లి, జూన్ 29 (విజయ క్రాంతి) ఆసియా ఖండంలోనే పేరుగాంచిన ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంక్ వ్యవస్థాపకులు కీర్తిశేషులు అలిగిరెడ్డి కాశీ విశ్వనాధ రెడ్డి 39 వర్ధంతి వేడుకలు సహకార బ్యాంకు ఆవరణలో జరిగాయి. ఈ సందర్భంగా ఏకే విశ్వనాథరెడ్డి కాంస్య విగ్రహానికి బ్యాంకు రైతులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు .
ఈ సందర్భంగా బ్యాంకు అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ మెట్ట ప్రాంత రైతుల కష్టాలు తీర్చేందుకు కీర్తిశేషులు విశ్వనాథరెడ్డి సహకార బ్యాంకు ఏర్పాటుతో రైతుల పాలిటి కల్పతరువుగా సహకార బ్యాంకు నిలిచిందన్నారు. వర్ధంతి కార్యక్రమంలో సహకార బ్యాంక్ జనరల్ మేనేజర్ మార్పాడి రామ్ రెడ్డి తో పాటు వేలాది మంది రైతుల పాల్గొన్నారు.