పది ఫలితాల్లో అక్షర విజదుందుభి

02-05-2024 01:14:41 AM

చొప్పదండి, మే1: పదోతరగతి ఫలితాల్లో రామడుగు మండలం గుండి అక్షర హైస్కూల్ విజయదుందుభి మోగించింది. పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు కే తేజశ్రీ, డీ హారిక, డీ అక్షిత 10 జీపీఏ సాధించారు. చగా, జీ శివరామకృష్ణ, ఏ మేఘన, జే కృతిక 9.8 జీపీఏ సాధించారు. మరో 48 మంది విద్యార్థులు 9 ఆపై జీపీఏ సాధించినట్టు విద్యాసంస్థల చైర్మన్ మినుకుల మునీందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను చైర్మన్ మినుకుల మునీందర్, ప్రదానోపాధ్యాయురాలు మినుకుల రాధ, ఉపాధ్యా యులు అభినందించారు.