08-09-2025 12:00:00 AM
ఆలేరు, సెప్టెంబర్ 07 (విజయ క్రాంతి): ఆలేరు మండల ప్రాదేశిక మరియు జిల్లా ప్రదేశిక సభ్యుల ఎన్నికలు 2025, ఎన్నికల నిర్వహణపై అన్ని రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులతో ఆవేశం నిర్వహించుట తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ హైదరాబాద్ ఆదేశానుసారము జరుగుచున్నది అని ఆలేరు ఎంపీడీవో తెలిపారు. ఆలేరు మండల పరిధిలో 7 ఎంపీటీసీల వారిగా ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా వివరాలను ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్ శనివారం విడుదల చేశారు.
సెప్టెంబర్ 6, 2025 నాటికి మొత్తం 21537 మంది ఓటర్లు నమోదు అయ్యరు. వీరిలో పురుషులు 10501, మహిళలు11035, ఇతరులు 01 గా ఉన్నారు. గ్రామాల వారీగా ఓటర్ల వివరాలు, కొలనుపాక-1 ఓటర్లు 3053, కొలనుపాక-2 ఓటర్లు 3385 మంది, రాఘవపురం 2519, టంగుటూరు 34 83, శారాజీపేట 2606, కొల్లూరు 34 41, గొలనుకొండ 3050 ఓటర్లు ఉన్నారు. తేది 08.09.2025 సోమవారం రోజు మధ్యాహ్నం 12 గంటలకు అన్ని రాజకీయ పార్టీల నాయకులతో ఎన్నికల సమావేశాన్ని నిర్వహించ నున్నట్టు అధికారులు తెలిపారు.