calender_icon.png 15 June, 2025 | 1:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.4,529 కోట్ల ఉపాధి పనులు

15-06-2025 01:42:03 AM

  1. గత ఆర్థిక సంవత్సరంలో 12.33 కోట్ల పనిదినాల లక్ష్యం
  2. సగటున ఒక్కో కూలీకి 45.82 రోజులపాటు ఉపాధి
  3. వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే 12,010 చోట్ల మట్టిరోడ్లు

హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): ఉపాధి హామీ పథకం అమలుపై రాష్ట్రప్రభు త్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. కేంద్ర ప్రభుత్వ కేటాయింపులు, సహకారంతో గ్రామీణ ప్రాం తాల్లో ఉపాధి సమస్యకు పరిష్కారం చూపుతున్నది. పేదరిక నిర్మూలనతో పాటు వలసల నివారణకు కృషి చేస్తున్నది. జాబుకార్డుదారులకు స్థానికంగానే ఉపాధి కల్పిస్తున్నది. తద్వా రా ఆయా కుటుంబాలకు ఆర్థిక చేయూతనిస్తున్నది.

గత ఆర్థిక సంవత్సరంలో రూ. 4,529.07 కోట్ల విలువైన పనులు చేపట్టింది. మొత్తంగా 12.23 కోట్ల పని దినాల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక జాబుకార్డుదారుడికి వంద రోజుల పాటు ఉపాధి కల్పించాల్సి ఉండగా, సగటున 45.82 రోజుల పాటు ఉపాధి కల్పించింది. సగటున ఒక్క కూలీకి రోజుకు రూ.213 చొప్పున వేత నం అందించింది. అలా కూలీ ఖాతాల్లో రూ. 2,614.3 కోట్ల వేతనాలు జమ చేసింది. అలాగే పనులకు సంబంధించిన సామగ్రికి రూ. 1,685.52 కోట్లు, అడ్మిన్ వ్యయం రూ. 229.25 కోట్లు వెచ్చించింది. 

పనులు ఇలా..

గతేడాది ఉపాధి యంత్రాంగం రాష్ట్రవ్యాప్తంగా 12,247 వేల పశువుల షెడ్లు నిర్మించిం ది. భవిష్యత్‌లో నీటి కొరత ఏర్పడకుండా భూగర్భజలాల పెంపు, వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు 1,224 రూఫ్ టాప్‌లు ఏర్పాటు చే సింది. గ్రామీణ ప్రాంతాల్లో 2,598 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మించింది. వ్యవసాయ అనుబంధ యూనిట్లలో 500 పౌ ల్ట్రీ షెడ్లు, 1551 మేకలు, గొర్రెల షెడ్లు, 1187 ఎన్‌ఏడీఈపీ -వర్మికంపోస్టు యూనిట్లు, 5,026 ఫారం పాండ్లు నిర్మించింది. అలాగే 5,827 సర్కార్ బడుల్లో మరుగుదొడ్లు నిర్మించింది. అలాగే 3,366 స్కూళ్లకు కాంపౌండ్ వాల్స్, 2,401 స్కూళ్లలో కిచెన్ షెడ్లు, 127 బోర్ వెల్ రీచార్జ్ స్ట్రక్చర్, 154 చెక్ డ్యాంలు నిర్మించింది. 2,598 పెర్కోలేషన్ ట్యాంకులు ఏర్పాటు చేసింది.

వానాకాలం సీజన్‌కు..

ప్రస్తుతం రాష్ట్రంలో వానాకాలం సాగు పనులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉపాధి యంత్రాంగం వ్యవసాయ రంగానికి అనుబంధమైన పనులకు ప్రాధాన్యతనిస్తున్నది. దీనిలో భాగంగా వ్యవసాయ పొలాలకు వెళ్లే మట్టి రోడ్ల నిర్మాణంపై దృష్టిసారించింది. యుద్ధప్రాతిపదికన ఆయా రోడ్లకు మరమ్మతులు చేస్తున్నది. అవసరమైన చోట్ల కొత్త బాటలు వేస్తున్నది. అలా రాష్ట్రవ్యాప్తంగా 12,010 మట్టి రోడ్లు నిర్మించింది.