28 నుంచి ఆలిండియా ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ చాంపియన్షిప్
హైదరాబాద్, డిసెంబర్ 28: తెలంగాణలో స్కూల్ స్థాయి నుంచే ప్రతిభ ఉన్న క్రీడాకారులను వెలికితీసే ఉద్దేశంతో కుంచెట్టి ఖేల్క్షేత్ర ఆలిండియా ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ చాంపియన్షిప్ నిర్వహిస్తోంది. ఈ పోటీలు జనవరి 28 నుంచి ఫిబ్రవరి 8 వరకూ సరూర్ నగర్, గచ్చిబౌలీ స్టేడియాల్లో జరగనున్నాయి. అండర్ 16,అండర్ 17 కేటగిరీల్లో నిర్వహించబోతున్నారు.
ఈ చాంపియన్షిప్కు సంబంధించిన పోస్టర్ను నిర్వాహకులు ఆవిష్కరించారు.గత నెలలో 3 రోజుల పాటు జరిగిన తెలంగాణ ఇంటర్ స్కూల్ చాంపియన్షిప్కు అద్భుతమైన స్పందన వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఒలింపిక్ సంఘం ప్రెసిడెంట్ ప్రేమ్రాజ్, సెక్రటరీ బాబూరావు సాగర్, మాజీ కోశాధికారి కే మహేశ్వర్, డైరెక్టర్ కుంచెట్టి ఖేల్క్షేత్ సీఈవో భవానీ ప్రసాద్, 7హెచ్ స్పోర్ట్స్ ఫౌండర్ వెంకటేశ్ పాల్గొన్నారు.




