31 May, 2026 | 10:10 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

సాత్విక్ జోడీకి టైటిల్

29-12-2025 12:00 AM

విజయవాడ, డిసెంబర్ 28 : జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలు విజయవాడలో ఘనంగా ముగిసాయి. ఈ టోర్నమెంట్‌లో మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణ క్రీడాకారులు కె.సాత్విక్ రెడ్డి, రాధిక శర్మ విజేతలుగా నిలిచారు. అలాగే పురుషుల సింగిల్స్‌లో ఎం.తరుణ్, మహిళల సింగిల్స్‌లో రక్షిత, మహిళల డబుల్స్‌లో వెన్నెల యు కాంస్య పతకాలను గెలుచుకున్నారు.

ముగింపు వేడుకలకు భారత జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. తెలంగాణ క్రీడాకారులు ఈ పోటీల్లో అద్భుతంగా రాణించారని కితాబిచ్చారు. నిరంతర సాధన, క్రమశిక్షణతో పాటు లక్ష్యంపై అచంచల విశ్వాసం ఉంటే ప్రపంచ స్థాయి విజయాలు సాధిండం అసాధ్యం కాదని గోపీచంద్ వ్యాఖ్యానించారు. భారత బ్యాడ్మింటన్ భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉందన్నారు.