10-05-2025 01:37:07 AM
సానుకూలంగా స్పందించిన మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళినాయక్
గూడూరు. మే 09 (విజయక్రాంతి)ఏజెన్సీ మండలంగా ఉన్న గూడూరులో జర్నలిస్ట్ లందరికీ ఒకేచోట ఇంటిస్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం కొంత కష్టమని చెబుతున్న నేపథ్యంలో..., మండలంలోని వర్కింగ్ జర్నలిస్ట్ లందరికీ వారి..వారి గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి న్యాయం చేయాలని కోరుతూ టియుడబ్ల్యూజే(ఐజేయు) గూడూరు మండలశాఖ అద్యక్షులు యాకాంబ్రం ఆద్వర్యంలో శుక్రవారం వినతిపత్రం సమర్పించారు.
టియుడబ్ల్యూజే(ఐజేయు) మహబూబాబాద్ జిల్లాఅద్యక్షులు సిహెచ్ శ్రీనివాస్, జిల్లా ప్రధానకార్యదర్శి గాడిపల్లి శ్రీహరి తోపాటు గూడూరు మండలానికి చెందిన యూనియన్ బాధ్యులు పాపయ్య, కరుణాకర్ రెడ్డి, యాకూబ్ అలీ, యాదగిరి, నవనీత్, నర్సింహా తదితరులు ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళినాయక్ ను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్బంగా టీయూడబ్ల్యూజే ఐజేయు మహబూబా బాద్ జిల్లాఅద్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ...
గూడూరు మండలంలోని వర్కింగ్ జర్నలిస్ట్ లు ఇంటిస్థలాల కోసం, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారని, తమ కోరిక నెరవేరుతుందని ప్రస్తుత ప్రభుత్వంపై, ఎమ్మెల్యే మురళీనాయక్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారన్నారు. జర్నలిస్ట్ల వినతిపై ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీనాయక్ అత్యంత సానుకూలంగా స్పందించారు. జర్నలిస్ట్ ల సమస్యలపై అంత్యంత సానుకూలంగా స్పందించిన మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళినాయక్ కు టియుడబ్ల్యూజే(ఐజేయు) పక్షాన ధన్యవాదాలు తెలిపారు.