24-06-2025 12:22:19 AM
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ జూన్ 23 (విజయ క్రాంతి) : జర్నలిస్టులు అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని మహబూబ్ నగర్ ఎ మ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం మెట్టు గడ్డ ప్రాంతంలోని ప్రెస్ క్లబ్లో ముడా నిధులతో ఏర్పాటు చేసిన బోరు మోటారు, ఆర్వో వాటర్ ప్లాంట్ ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ ఎలాంటి అసమానతలు ఉండకూడదని, మీరంతా జర్నలిస్టులు అనే భావన ఉం డాలన్నారు
ప్రజలకు మంచి జరగాలని తా ను రాజకీయాలకు వచ్చినట్లు ఆయన తెలిపారు. అందరినీ కలుపుకొని ముందుకు పో వాలని , మీ సమస్యలను నా దృష్టికి తీసుకురావాలని, ఒక్కోక్కటి పరిష్కారిస్తానని హా మీ ఇచ్చారు. సుప్రీంకోర్టు జర్నలిస్టులకు ఇం టి స్థలాలు ఇవ్వకూడదని సూచిందని అం దుకే భవిష్యత్తు లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చె ప్పారు.
మీరు తొందర పడితే నష్టపోయే అ వకాశం ఉంటుందన్నారు. అందరిని దృష్టిలో ఉంచుకుని తొందర నిర్ణయాలు తీసుకోవడం లేదన్నారు. అందరూ తప్పక హెల్త్, మెడికల్ భీమా తీసుకోవాలి అని ఆయన సూచించారు. ప్రెస్ క్లబ్ లో క్రమం తప్పకుండా ప్రెస్ మీట్ లు ఏర్పాటు చేసేటట్లు చర్యలు తీసుకోవాలని ఆయన సూ చించారు.
ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్ పి వెంకటేష్, మారేపల్లి సురేందర్ రెడ్డి, తఖి, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నరేందర్ చారి, ప్రధాన కార్యదర్శి నరేందర్, కోశాధికారి పల్లెమోని యాదయ్య, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.
ఉర్దూ ఘర్ తో ఎంతో మేలు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీఉర్దూఘర్ తో ఎంతో మేలు జరుగుతుందని మహబూబ్ నగర్ పట్టణం లోని అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. కళాభవన్ ఆవరణలో ఉర్దూ ఘర్ భవన నిర్మాణానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డితో కలిసి భూమి పూజ నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ గత పన్నెండు సంవత్సరాలుగా పోరాటం చేసినా ఫలితం లేక పోయిందని, ఎమ్మెల్యే గా యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు విజయం సాధించిన తర్వాత అది సాధ్యమైందని ఆయన చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుత మహబూబ్ నగర్ చరిత్రలో మరుపురాని రోజు అన్నారు.
ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి కానీ, ఉర్దూ ఘర్ నిర్మాణానికి మాత్రం నోచుకోలేదని, గౌరవ తెలంగాణ రాష్ట్ర ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన మహబూబ్ నగర్ లో ఉర్దూ ఘర్ నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతు లు ఇచ్చి, నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, ఎమ్మెల్సీ చీఫ్ ఎడిటర్ సియాసత్ డైలీ ఆమేర్ అలీ ఖాన్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, ఉ ర్దూ అకాడమీ, చైర్మన్ తాహెర్ బిన్ హ మ్దాన్, తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేని, ఫహీమ్ ఖురేషి, హజ్ కమి టీ చైర్మన్, ఖుస్రో పాషా, అవేజ్, సల్మాన్, ఫయాజ్, అజ్మత్ అలి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.