03-06-2025 12:48:14 AM
మంత్రి ధనసరి అనసూయ సీతక్క
విజయక్రాంతి,ములుగు ప్రతినిధి: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో రాష్ట్రంలోని పాత్రికేయులు కీలక పాత్ర పోషించారని,సబ్బండ వర్గాల వారి ఉద్యమాన్ని గ్రహించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిందని రాష్ట్ర పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి,గ్రామీణ నీటి సరఫరా మరియు స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
ములుగు జిల్లా అభివృద్ధికి అన్ని వర్గాల వారు సహకరించాలని,ఇక్కడి పర్యాటక ప్రాంతాలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని ఆమె తెలిపారు.సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ తో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఇవ్వని హామీలను అమలు చేస్తున్నదని,సంక్షేమ ఫలాలను అందించడానికి ఆరూలను గుర్తించడం జరుగుతున్నదని వివరించారు.
రైతులు లైసెన్స్ కలిగిన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి..
ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో జిల్లాలోని రైతులు లైసెన్సు కలిగిన విత్తన దుకాణంలోనే విత్తనాలు కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ అన్నారు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విత్తనాలు కొనుగోలు చేసే విషయంలో రైతులకు అవగాహన కల్పించడానికి వారం రోజులపాటు అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని ప్రతి రైతు విత్తనాలు కొనుగోలు చేయగానే రసీదు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ భానోతు రవిచందర్,అదనపు కలెక్టర్ సంపత్ రావు,ఆర్డీవో వెంకటేష్,డిపిఆర్ఓ రఫిక్ పాల్గొన్నారు.