31-12-2025 12:00:00 AM
అమీన్ పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్
అమీన్ పూర్, డిసెంబర్ 30 :వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని బీరంగూడ జిహెచ్ఎంసి పరిధిలోని వందనపురి కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అమీన్ పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి సం దర్భంగా కుటుంబ సమేతంగా వందనపురి కాలనీలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో స్వా మివారిని దర్శించుకోవడం జరిగింది అని అన్నారు.
అదేవిధంగా ఆ యొక్క భగవంతుడి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలపై ప్రతి ఒక్కరిపై ఉండేలా చూడాలని ఆయన మనసారా కోరుకున్నారు. వైకుంఠ ఏకాదశి పుర స్కరించుకొని పటాన్ చెరు నియోజకవర్గ ప్రజలకు మరియు బీరంగూడ జిహెచ్ఎంసి వివిధ కాలనీల వాసులకు ప్రతి ఒక్కరికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు.