24 March, 2026 | 8:34 PM

Breaking News

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన   •   జన గణనను పకడ్బందీగా పూర్తి చేయాలి   •   ప్రభుత్వానికి నాణ్యమైన సమాచారం అందించేలా కృషి చేయాలి   •   ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు సత్వర చర్యలు   •   సంత నిర్వాహణ వేలంలో పెరిగిన ఆదాయం 5.02 శాతం మాత్రమే   •   జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం   •   ద్వారకుంటలో సిసి రోడ్డు శంకుస్థాపన: సర్పంచ్ పాలకి సురేష్   •   ఖైదీలకు బెయిల్ విషయంలో సహాయం చేయడమే సాధికార కమిటీ ఉద్దేశ్యం   •   కోనరావుపేట 10వ వార్డ్‌లో పారిశుధ్య సమస్యలు   •   కోదండరామాలయం పరిసరాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు   •  

బాసర ట్రిపుల్ ఐటీ సీట్లు కేటాయింపు

04-07-2024 02:10 AM

తొలి జాబితా విడుదల 

1404 మందికి సీట్లు 

8 నుంచి కౌన్సిలింగ్

హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): విద్యాసంవత్సరానికి బాసర ఆర్జీయూకేటీ (ట్రిపుల్ ఐటీ)లో ఆరేళ్ల ఇంటిగ్రెటేడ్ బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన తొలి జాబితా విడుదలైంది. బుధవారం విద్యాశా ఖ ముఖ్యకార్యదర్శి వెంకటేశం, బాసర ట్రిపు ల్ ఐటీ ఇన్‌చార్జ్ వీసీ వెంకట రమణ కలిసి సచివాలయంలో జాబితాను విడుదల చేశా రు. మొత్తం 1404 సీట్లను విద్యార్థులకు కేటాయించారు. అత్యధికంగా సిద్దిపేట జిల్లా నుంచి 330 మంది ఎంపికవగా వనపర్తి, జోగులాబ గద్వాల జిల్లాల నుంచి ఒక్కొక్కరి చొప్పున మాత్రమే ఎంపికయ్యారు. తొలి జాబితాలో సీట్లు పొందిన విద్యార్థులకు ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. వివరాలకు www. rgukt.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.