21-02-2026 01:52:28 AM
ఛార్జీషీట్లో లోపాలు!
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్కు ఎంతమాత్రం ఉపశమనం కలగటం లేదు. అల్లు అర్జున్ హీరో గా నటించిన ‘పుష్ప-2’ సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే ఛార్జీషీట్ నమోదైంది. అల్లు అర్జున్ సహా 23 మందిని బాధ్యులుగా చూపుతూ పోలీసులు ఛార్జీషీట్ దాఖలు వేశారు.
తాజాగా ఈ కేసు ఛార్జీషీటును నాంపల్లి కోర్టు తిప్పి పంపించింది. హార్డ్ డిస్క్లు, సీడీలు, పెన్డ్రైవ్లు జతపరచకపోవడంతో తాజాగా మరోసారి ఛార్జిషీట్ను వాపస్ చేసింది. ఇలా తిప్పి పంపడం రెండోసారి కావడం గమనార్హం. 2024 డిసెంబర్ 4న ‘పుష్ప -2’ బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాట జరి గింది. ఆ ఘటనలో రేవతి అక్కడికక్కడే చనిపోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ కిందపడి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఘటన జరిగి ఏడాదిన్న పూర్తికావస్తు న్నా బాలుడు ఇంకా కోలుకోలేదు.