26 May, 2026 | 12:58 PM

Breaking News

సుల్తానాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యేదే   •   పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన   •   డంప్ యార్డ్ ఏర్పాటుకు ఒప్పుకోం..!   •   తాళం వేసిన ఇంట్లో చోరీ   •   మళ్లీ సీఎం కుర్చీ పంచాయతీ.. ఢిల్లీకి సిద్ధూ, డీకే.. పర్యటనపై ఉత్కంఠ   •   రోడ్డుప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి.. ఎస్పీ నితికా పంత్ నివాళి   •   ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు   •   పాలమూరు ప్రాజెక్టు పూర్తికి.. అవాంతరాలు అధిగమిస్తాం: మంత్రి జూపల్లి   •   డ్రైవర్ నిద్రమత్తు.. పొలాల్లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు బోల్తా   •   మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు   •  

అల్లు అర్జున్ సినిమా తొక్కిసలాట కేసు..

21-02-2026 01:52 AM

ఛార్జీషీట్‌లో లోపాలు!

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు ఎంతమాత్రం ఉపశమనం కలగటం లేదు.  అల్లు అర్జున్ హీరో గా నటించిన ‘పుష్ప-2’ సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటుచేసుకున్న విషయం తెలిసిందే.  ఈ ఘటనపై ఇప్పటికే ఛార్జీషీట్ నమోదైంది. అల్లు అర్జున్ సహా 23 మందిని బాధ్యులుగా చూపుతూ పోలీసులు ఛార్జీషీట్ దాఖలు వేశారు. 

తాజాగా ఈ కేసు ఛార్జీషీటును నాంపల్లి కోర్టు తిప్పి పంపించింది.  హార్డ్ డిస్క్‌లు, సీడీలు, పెన్‌డ్రైవ్‌లు జతపరచకపోవడంతో తాజాగా మరోసారి ఛార్జిషీట్‌ను వాపస్ చేసింది. ఇలా తిప్పి పంపడం రెండోసారి కావడం గమనార్హం. 2024 డిసెంబర్ 4న ‘పుష్ప -2’ బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాట జరి గింది.   ఆ ఘటనలో రేవతి అక్కడికక్కడే చనిపోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ కిందపడి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఘటన జరిగి ఏడాదిన్న పూర్తికావస్తు న్నా బాలుడు ఇంకా కోలుకోలేదు.