15-06-2025 10:18:02 PM
మోతె: ఆదివారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1992-93 బ్యాచ్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనని ఘనంగా నిర్వహించారు. గురువులను ఘనంగా సన్మానించి గురువుల ఆశీర్వాదం తీసుకొని తరగతి గదిలో జరిగిన కొన్ని తీపి జ్ఞాపకాలను నెమురవేసుకొని ప్రయోజకులైన శిష్యులను చూసి అనంద భాష్పాలతో మనస్సు నిండా మురిసిపోయారు. రామచంద్ర రెడ్డి నీలం రెడ్డి బిక్షం వెంకటేశ్వర తిరుమల్ రెడ్డి విద్యార్థులు కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని అందరి అనుభవాలను పంచుకున్నారు. కుటుంబ సభ్యులు అందరితో కలిసి సాంస్కృతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇండ్ల పర్ష రామ్, వీరాచారి, బ్రహ్మ చారి, భద్రమ్మ, రాధ, గులాం ఉస్సెన్, మాసిరెడ్డి వెంకట్ నారాయణ, కొమ్ము లింగా రాజు, తదితరులు పాల్గొన్నారు.