09-10-2025 12:23:13 AM
డిచ్పల్లి, అక్టోబర్ 8 (విజయ క్రాంతి): తెలంగాణ విశ్వవిద్యాలయంలో అకాడమిక్ ఎన్విరాన్మెంటును సృష్టించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆదేశాల మేరకు విశ్వవిద్యాలయంలో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని పకడ్బందీగా అమలు చేయనున్నామని వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు తెలిపారు. తెలంగాణవిశ్వవిద్యాలయంలో వైస్- ఛాన్స్లర్ తన ఛాంబర్ లో వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్. టి. యాదగిరిరావు రిజిస్ట్రార్ ఎం యాదగిరి తో కలిసి విబాగాధిపతుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వైస్ -ఛాన్స్లర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు మాట్లాడుతూ.. ఈ సంవత్సరం కళాశాలలో మొదటి సంవత్సరంలో జాయిన్ అయినా విద్యార్థిని విద్యార్థులకు పకడ్బందీగా తరగతులునిర్వహించాలన్నారు. ఎట్టి పరిస్థితులలో పరీక్షలు వాయిదా వేయరాదని, సమయానికి ఇంటర్నల్ ఎగ్జామ్స్, ప్రాక్టికల్స్ కంప్లీట్ చేయాలని విభాగాధిపతులను ఆదేశించారు.
ఈ సమావేశంలో యూనివర్సిటీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల, ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సిహెచ్ ఆరతి, బిక్నూర్ సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ గౌడ్, సారంగపూర్ బి.ఎడ్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సాయిలు ఆడిషన్ డైరెక్టర్, ప్రొఫెసర్ గంటా చంద్రశేఖర్, కంట్రోలర్ ప్రొఫెసర్ కే సంపత్ రెడ్డి, ప్రొఫెసర్ విద్యావర్ధిని, ప్రొఫెసర్ రాంబాబు గోపిశెట్టి, ప్రొఫెసర్ సిహెచ్ ఆంజనేయులు, డాక్టర్ ఎల్లో సా, డాక్టర్ సమత, డా. ప్రసన్న, డాక్టర్ సత్యనారాయణ రెడ్డి, డాక్టర్ నీలిమ, డాక్టర్ లక్షణ చక్రవర్తి, డా పాత నాగరాజు, డా ఏ పున్నయ్య తదితరులు పాల్గొన్నారు.