05-06-2025 10:49:38 PM
చేగుంట (విజయక్రాంతి): మండలంలోని కిష్టపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాతమిక పాఠశాలలో గురువారం భూ భారతి రెవెన్యూ సదస్సు(Bhu Bharati Revenue Conference) నిర్వహించారు. భూ సమస్యలపై ప్రజలు తహసీల్దార్ కు దరఖాస్తులు అందజేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీకాంత్(Tehsildar Srikanth) మాట్లాడుతూ... జూన్ మూడో తేదీ నుంచి 20 వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు కొనసాగుతాయని, భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఉన్నత అధికారులు తెలిపిన విధంగా సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. శుక్రవారం కసన్ పల్లి, అన్నంత సాగర్ లో సదస్సు ఉంటుందని, భూ సమస్యలు ఉన్న వారు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక రెవెన్యూ ఇన్స్పెక్టర్ జయ భారత్ రెడ్డి, సంతోష్,మేఘన, సర్వేయర్ రవీందర్, జూనియర్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.