27 March, 2026 | 1:44 AM

మున్సిపల్ అక్రమాలపై విచారణ జరపాలి

27-03-2026 12:00 AM

కాగజ్‌నగర్, మార్చి ౨౬ (విజయక్రాంతి): కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో జరుగుతున్న ఆర్థిక అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. గురువారం మున్సిపల్ కమిషనర్ తిరుపతికి  వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా పాత ఆమోదాలతో చేపడుతున్న పనులను వెంటనే రద్దు చేయాలని కోరారు. మున్సిపల్ నిబంధనలు పాటిస్తూ ప్రజా ప్రయోజనాలను కాపాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రాము, మాణిక్యం, వలీ, పోచం, వసీం, నాయకులు సాయి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.