చిన్నారులకు వైద్య పరీక్షలు
మంచిర్యాల టౌన్, మార్చి 26: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ, ఐసిడిఎస్ జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆశ్రమాలను, బాలసదనాల్లో ఉన్న పిల్లలకు గురువారం వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సాహితీ పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు.
వైద్య శిబిరాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ అనిత, జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్ లు సందర్శించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అశోక్, డాక్టర్ రాము, డాక్టర్ రజిత, బాలసదనం అధికారి రంజిత, ఏకలవ్య ఫౌండేషన్ మేనేజర్ శ్రీనివాస్, గోపాల్ రావు, ఐసిడిఎస్ సత్తయ్య, డెమో బుక్క వెంకటేశ్వర్, ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రం సిహెచ్ఓ, ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.




