27 March, 2026 | 9:41 PM

చికిత్స పొందుతూ గుర్తుతెలియని వృద్ధురాలు మృతి

27-03-2026 07:55 PM

జవహర్ నగర్,(విజయక్రాంతి): గుర్తుతెలియని ఓ వృద్ధురాలు దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ హెచ్ ఓ సైదులు తెలిపిన కథనం ప్రకారం జవహర్ నగర్ లోని సిపిఐ కాలనీలో వృద్ధురాలు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుంది. ఈనెల 2న వృద్ధురాలు అపస్మారక స్థితిలో పడి ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వృద్ధురాలుని గాంధీ ధావకానకు తరలించి చికిత్స అందించారు. ఈ నెల 22న వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందిందని గాంధీ వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ప్రాంతంలో వృద్ధురాలు ఒంటరిగా ఉంటుందని ఆమెకు ఎవరూ లేరని పోలీసుల విచారణ లో తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.