30-06-2025 12:31:41 AM
భీమదేవరపల్లి, జూన్ 29 ( విజయ క్రాంతి) : ముల్కనూర్ శ్రీ విశ్వశాంతి విద్యాలయం పూర్వ విద్యార్థులు 2010-11 బ్యాచ్కు చెందిన వారు ప్రత్యేకమైన ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. గురువుల పట్ల కృతజ్ఞతతో, మిత్ర బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ ఈ కార్యక్రమం రూపొందించబడింది. గురుః సాక్షాత్ పరబ్రహ్మ అనే భావనతో, గురువుల ఆశీస్సులతో ప్రారంభమైన ఈ సమావేశం, స్నేహబంధాన్ని గుర్తుచేస్తూ అనుభూతుల నిలయంగా నిలిచింది.
‘మీ చిరునవ్వు తెలిసిన మిత్రుని కన్న, నీ కన్నీళ్ల విలువ తెలిసిన మిత్రుడు మిన్న‘ అనే భావోద్వేగ సందేశం ఈ కార్యక్రమానికి ప్రాణం పోసింది. ఈ కార్యక్రమంలో తాళ్లపల్లి మహేందర్, దస్తరి ఉమామహేశ్వర్, చెప్యాల గోపాల్ రెడ్డి, తిరుపతాచారి, అనగాని శ్రీనివాస్, ఎల్కపల్లి శ్రీనివాస్, మొగిలి, రాములు, ఈశ్వర్, గుడికందుల విజయ్, పద్మ, గీత, జయ, అనిత తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. స్నేహానికన్న మిన్న లోకాన లేదురా అనే మాటను సార్థకం చేస్తూ, ఈ ఆత్మీయ సమ్మేళనం అందరికీ జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని మిగిల్చింది.