calender_icon.png 30 June, 2025 | 7:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం

30-06-2025 12:32:50 AM

ఎమ్మెల్యే మురళి నాయక్ 

మహబూబాబాద్, జూన్ 29 (విజయ క్రాంతి): మహబూబాబాద్ పట్టణ ప్రజల మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ అన్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఒకటవ వార్డు ఈదుల పూసపల్లిలో ఐదు లక్షల రూపాయలతో చేపట్టనున్న సిమెంట్ రోడ్డు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మట్టిరోడ్లతో వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్య సిసి రోడ్డు నిర్మాణంతో తొలగిపోతుందన్నారు. ఇదేవిధంగా పట్టణ పరిధిలో ప్రతి వార్డులో ప్రజలకు మెరుగైన రోడ్డు వసతి కల్పిస్తామని చెప్పారు.

పట్టణంతోపాటు నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామంలో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.