04-06-2025 01:16:49 AM
మొదలైన కార్యక్రమాలు
పటిష్ట భద్రత నడుమ అయోధ్యాపురి
లక్నో, జూన్ 3: అయోధ్యలోని శ్రీరామజన్మభూమి ఆలయంలో రెండో దశ ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవాలు మంగళవారం మొదలయ్యాయి. సోమవారం సరయూ నదీ తీరం లో స్వామి వారి ఊరేగింపును ప్రారంభించారు. ఆలయ అధికారుల ప్రకటన ప్రకా రం.. ‘మొదటి అంతస్థులోని రామ్ దర్బార్లో కాంప్లెక్స్లోని ఆరు ఇతర ఆలయాల్లో విగ్రహాలను ప్రతిష్ఠంచనున్నారు.
ఈ కార్యక్రమం జూన్ 5న గంగాదసరా ఉత్సవాలతో ముగియనుంది.’ అని అధికారులు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం సరయూ ఘాట్ నుంచి కలశ యాత్ర మొదలై.. వీణా చౌక్, రామ్ పత్, సింగర్ హట్, రంగ్ మహల్ బారియర్ గుండా రామాలయ ప్రాంగణానికి చేరుకుంది.
మంగళవారం ఉదయం 6.30 నుంచి సాయంత్రం 6.30 వరకు 1,975 మంత్రాలు, రామ రక్ష స్తోత్ర, హనుమాన్ చాలీసా పారాయణం, ప్రత్యేక పూజలు, హారతి, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు జరిగాయి. నేడు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదే విధంగా కార్యక్రమాలు జరగనున్నాయి.
జూన్ 5న రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడి విగ్రహాలతో పాటు మరో ఆరు దేవాలయాల ప్రతిష్ఠ్ఠాపన కార్యక్రమం జరగనుం దని ఆలయ అధికారులు పేర్కొన్నారు.
ప్రజలెవరూ రాకండి
ప్రస్తుతం ప్రజలెవరూ అయోధ్యను సందర్శించవద్దని శ్రీరామ జన్మభూమి కార్యదర్శి చంపత్ రాయ్ కోరారు. జూన్ 3 మధ్య రామదర్బార్ను చూసేందుకు ప్రజలెవరూ రావద్దని ఒక ప్రకటనలో కోరారు. ఈ కార్యక్రమం కోసం ఎవరినీ ఆహ్వానించలేదని ఆయన తెలిపారు.
రామ్ దర్శనం కో సం ఆలయం తెరిచే ఉంటుందని రామ్దర్బార్కు మాత్రం భక్తులెవరికీ ఆహ్వానం లేద న్నారు. కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్ నిఖిల్ పేర్కొన్నారు. షెడ్లు, తాగునీరు, సానిటేషన్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచినట్టు పేర్కొన్నారు.
హైఅలర్ట్
రెండోదశ ప్రాణప్రతిష్ఠాపన సందర్భంగా అయోధ్యలో హైఅలర్ట్ ప్రకటిం చారు. ఆలయ ప్రాంగణం మొత్తం యాంటీ టెర్రరిజం స్వాడ్ (ఏటీఎస్) కమాండోలు అణువణువూ జల్లెడ పడుతున్నారు. ఆలయ చుట్టుపక్కల ఆయుధాలతో ఉన్న వాహనాలు నిలిపారు. ఆలయప్రాంగణం మొత్తం రెడ్ జోన్గా ప్రకటించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
మూడు షిఫ్టుల్లో సిబ్బంది భద్రతను సమీక్షిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాలుగు కీలక కార్యక్రమాలకు హాజరవనున్నారు. ప్రధాన శంకుస్థాపన కార్యక్ర మం, సరయు త్రయోదశి ఉత్సవ్, ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ జన్మదిన వేడుకలు, ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలకు కూడా సీఎం హాజరవనున్నారు.