calender_icon.png 5 June, 2025 | 9:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రంప్ బెదిరింపులకు మోదీ లొంగిపోయారు

04-06-2025 01:16:28 AM

  1. అమెరికా అధ్యక్షుడి ఫోన్‌తోనే పాక్‌తో కాల్పుల విరమణ ఒప్పందం
  2. ‘నరేందర్ సరెండర్’ అనగానే ప్రధాని ‘జీ హుజూర్’ అన్నారు
  3. ఒత్తిడికి తలొగ్గడం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నేతలకు అలవాటే 
  4. 1971 యుద్ధ సమయంలో ఇందిరా గాంధీ ఎవరికీ భయపడలేదు
  5. ఆపరేషన్ సిందూర్‌పై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

భోపాల్, జూన్ 3: ఆపరేషన్ సిందూర్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు ప్రధాని మోదీ లొంగిపోయారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ట్రంప్ ఫోన్ చేయగా నే పాక్‌తో కాల్పుల విరమణ ఒప్పందం చే సుకున్నారని పేర్కొన్నారు. మంగళవారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో పర్యటించిన రాహుల్ గాంధీ ‘సంఘ్థాన్ సృజన్ అభిమాన్’ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆప రేషన్ సిందూర్‌పై మరోసారి సంచలన వ్యా ఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘ట్రం ప్ బెదిరింపులకు మోదీ లొంగిపోయారు. నరేందర్.. సరెండర్ అనగానే భయపడ్డారు. వెంటనే పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ ప్రకటించారు. ఆపరేషన్ సిందూర్ ప్రారంభం కాగానే మోదీకి ట్రంప్ ఫోన్ చేశారు. మోదీ జీ.. ఏం చేస్తున్నారని ఫోన్‌లోనే కోప్పడ్డారు.

ఫోన్‌లైన్‌లో ట్రంప్ సరెండర్ అనగానే.. మో దీ వెంటనే ‘జీ హుజూర్’ అని ఆయన ఆదేశాలు పాటిస్తూ పాక్‌తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నారు. కేవలం ట్రంప్ భ యంతోనే పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ ప్రకటించారు. ఒత్తిడికి తలొగ్గడం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నేతలకు అలవాటే. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి వాళ్లకు లొంగుబాటు లేఖలు రాసే అలవాటు ఉంది.

కానీ కాంగ్రెస్ అలా కాదని.. ఎవరి బెదిరింపులకు తలొగ్గ దు.  గాంధీజీ, నెహ్రూజీ, సర్దార్ పటేల్‌జీ లాంటి వ్యక్తులు ఎవరికి లొంగిపోలేదని.. మాజీ ప్రధాని ఇందిరా ఎవరికి భయపడలేదు. 1971 యుద్ధం సమ యంలో చైనా, పాకిస్థాన్‌కు భారత్ సత్తా ఏంటో చూపించా రు. అమెరికా నౌకాదళం ముందుకు వచ్చినప్పుడు నేను చేయవలసినది చేస్తాను అని చెప్పారు.’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

గతంలోనూ ఇదే తరహాలో..

అంతకుముందు కూడా ఆపరేషన్ సిందూర్‌పై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులు చేసింది. అయితే ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయడానికి ముందు కేంద్రం పాకిస్థాన్‌కు సమాచారం ఇచ్చినట్టు ఆరోపిస్తూ రాహుల్ గాంధీ ఆరోపణలు తెర తీశారు. రాహుల్ ట్వీట్ దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది.