19-08-2025 11:33:06 PM
కామారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): హైదరాబాద్ టీ.హబ్ లో జరిగిన 'ఇండియన్ స్పేస్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ -2025' అనే పోటీలో 100 పైగా పాఠశాలలు పాల్గొన్నాయి. దీనిలో కేవలం నాలుగు పాఠశాలలు ఎంపికయ్యాయి. Erudite అనే విభాగంలోప్రతిష్టాత్మక సంస్థ ప్రతినిధి సత్య వర్ధన్ రెడ్డి పర్యవేక్షణలో( రాకెట్ లాంచింగ్ వెహికల్స్) అనే విభాగంలో కామారెడ్డి జిల్లాకు చెందిన SPR పాఠశాల విద్యార్థులు తృతీయ బహుమతి గెలుచుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులను, ఉపాధ్యాయులను, పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ మారుతి అభినందించారు.