7 April, 2026 | 2:19 PM

ఇదో చారిత్రాత్మక ముందడుగు: ఆంటోనియో కోస్టా

27-01-2026 02:13 PM

న్యూఢిల్లీ: భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఇదో చారిత్రాత్మక ముందడుగు అని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో లూయిస్ శాంటోస్ డా కోస్టా(President of the European Council António Luís Santos da Costa,) తెలిపారు. ఐరోపా, భారత్ బంధం ఈనాటిది కాదని వెల్లడించారు. తన పూర్వీకులు గోవాకు చెందిన వారని తెలిపారు. ఒప్పందం కుదిరేందుకు మోదీ ఎంతో చొరవ చూపారని ఆయన పేర్కొన్నారు. ఐరోపా, భారత సహకారం కొత్త శిఖరాలకు చేరుతోందని తెలిపారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య కీలక ఒప్పందం కురిదిందని చెప్పారు.

 భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అన్నారు. శతాబ్దాలుగా మన రెండు ఖండాల మధ్య వాణిజ్యం ప్రవహిస్తోంది. వాణిజ్యం కీలకమైన భౌగోళిక రాజకీయ స్థిరీకరణ, ఆర్థిక వృద్ధికి ప్రాథమిక మూలం. వాణిజ్య ఒప్పందాలు నియమాల ఆధారిత ఆర్థిక క్రమాన్ని బలోపేతం చేస్తాయి. భాగస్వామ్య శ్రేయస్సును ప్రోత్సహిస్తాయి. అందుకే నేటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చారిత్రాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇప్పటివరకు ముగిసిన అత్యంత ప్రతిష్టాత్మక ఒప్పందాలలో ఒకటి, 2 బిలియన్ ప్రజల మార్కెట్‌ను సృష్టిస్తోందన్నారు. భారతదేశం-యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని అన్ని ఒప్పందాలకే తలమానికంగా ప్రధాని మోదీ అభివర్ణించారు.