15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

వేధింపులు అపాలని విద్యుత్ శాఖ ఉద్యోగుల నిరసన

27-01-2026 01:45 PM

జిల్లా విద్యుత్ భవన్ ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): విద్యుత్ శాఖ యాజమాన్యం ఇచ్చిన అక్రమ సస్పెన్షన్లను వెంటనే ఎత్తివేస్తూ ఉద్యోగులు, కార్మికులపై జరుగుతున్న వేధింపులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జిల్లా విద్యుత్ శాఖ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో  జిల్లా విద్యుత్ భవన్ ముందు నిరసన చేపట్టారు. ఈ నిరసనలో ఇంజనీర్లు, అకౌంట్స్ ఆఫీసర్లు, ఉద్యోగులు, కార్మికులు, ఆర్టిజన్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అక్రమ సస్పెన్షన్లను ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు.

ఉద్యోగులపై నిరాధార ఆరోపణలు చేసి వేధింపులకు గురిచేయడం అన్యాయమని, శాఖలో పని చేసే ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీసే చర్యలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, నాగర్ కర్నూల్ జిల్లా తాడూర్ మండలం ఇంద్రకల్ గ్రామంలో జరిగిన విద్యుత్ ప్రమాదంలో లోకేష్ అనే విద్యార్థి మృతి చెందడంపై రాష్ట్ర విద్యుత్ శాఖ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవడంపై ఉద్యోగులు నిరసన చేపట్టడం విశేషం.