1 June, 2026 | 12:02 PM

Breaking News

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై తెలంగాణ CID బిగ్ ఆపరేషన్.. 11 మంది అరెస్ట్   •   బిగ్ షాక్... మరోసారి పెరిగిన సిలిండర్ ధరలు.. ఎంతంటే?   •   సీఎం పర్యటన బందోబస్తుపై పోలీసు అధికారులకు ఎస్పీ నితికా పంత్ బ్రీఫింగ్   •   రామేశ్వరం కోనేరులో పడి మహిళ మృతి   •   ఆర్యవైశ్య మహాసభ పట్టణ అధ్యక్షుడిగా బిల్లకంటి హరిబాబు గెలుపు   •   సింగరేణిలో మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహణ   •   భద్రాచలంలో విలేకరుల ముసుగులో అక్రమదందా   •   కేసీఆర్‌తో ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి భేటీ   •   జాగరి గట్టమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించిన మాజీ జడ్పీటీసీ సదానందం   •   హైదరాబాద్‌లో అవార్డు అందుకున్న ఆదివాసి బిడ్డ   •  

మదర్ ఆఫ్ ఆల్ డీల్స్

27-01-2026 01:55 PM

భారత్-ఈయూ మధ్య చారిత్రాత్మక ఒప్పందం

న్యూఢిల్లీ: భారత్ భాగస్వామ్యం సరికొత్త శిఖరాలకు చేరుతోందని ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) అన్నారు. భారత్-ఈయూ మధ్య మంగళవారం నాడు చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరిందని ప్రధాని మోదీ ఇండియన్ ఎనర్జీ వీక్ వేదికగా ప్రకటించారు. ఈ ఒప్పందాన్ని "మదర్ ఆఫ్ ఆల్ డీల్స్"గా అభివర్ణించారు. ఈ ఒప్పందంతో భారత వాణిజ్యంలో సరికొత్త శకం మొదలైదని తెలిపారు. భారతదేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద స్వేచ్ఛావాణిజ్య ఒప్పందమని ప్రధాని పేర్కొన్నారు. టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ రంగాల్లో స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం జరిగిందన్నారు. ప్రపంచ జీడీపీలో 25 శాతం, వాణిజ్యంలో మూడో వంతు వాటా కలిగి ఉంటుందని పేర్కొన్నారు. కోట్లాది భారతీయులకు, యూరోపియన్లకు అపారమైన అవకాశాలు లభిస్తాయని తెలిపారు.