1 July, 2026 | 6:27 PM

Breaking News

నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •   గీతం 17వ గ్రాడ్యుయేషన్ డే ఆగస్టు 1న   •   రైతు భరోసా చారిత్రక ఘట్టం.. రైతుల కోసం లక్ష కోట్ల వ్యయం: ఎమ్మెల్యే రాగమయి   •   ఇల్లందు టీడీపీ కార్యకర్తను ఫోన్‌లో పరామర్శించిన చంద్రబాబు   •   మెరుగైన వైద్యం అందించాలి   •  

కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి

07-12-2025 06:45 PM

పలు గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే రోహిత్..

పాపన్నపేట (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కోరారు. ఆదివారం మండల పరిధిలోని ఎల్లాపూర్, శానాయిపల్లి, పొడిచన్ పల్లి తండా, నాగసాన్ పల్లి, శేరిపల్లి, కొడపాక, గాజులగూడెం, ఎనికేపల్లి, బాచారం, రాజ్యా తండా, అర్కెల్, నార్సింగ్, సీతానగరం గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులతో ప్రచారం నిర్వహించారు. అనంతరం బాచారం గ్రామంలో కాంగ్రెస్ నాయకులైన వెంకట్ తల్లి ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

అనంతరం ఎమ్మెల్యే రోహిత్ మాట్లాడుతూ.. పార్టీ బలపరిచిన అభ్యర్థులకు పూర్తి మద్దతు ఉంటుందన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. గ్రామానికి ప్రత్యేక నిధులు కేటాయించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తుందన్నారు. ఆయన వెంట మండల నాయకులు ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, గోవింద్ నాయక్, భూమయ్య తదితరులు ఉన్నారు.