14-10-2025 04:33:55 PM
ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్కి ఆహ్వానం..
సనత్నగర్ (విజయక్రాంతి): ఈ నెల 26వ తేదీన పద్మారావునగర్ లోని హమాలీ బస్తీలో బొడ్రాయి పండుగ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మంగళవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్ కార్యాలయంలో మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను హమాలీ బస్తీ వాసులు పద్మారావు నగర్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కలిసి బొడ్రాయి పండుగకు ఆహ్వానించారు. హామాలీ బస్తీ ప్రజలు అంతా సుఖసంతోషాలతో ఉండాలని తాము కోరిన వెంటనే బొడ్రాయి ప్రతిష్ట జరిపించారని ఎమ్మెల్యేకు వారు కృతజ్ఞతలు తెలిపారు. బొడ్రాయి ప్రతిష్ట జరిగి మూడు సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ నెల 26వ తేదీన ప్రత్యేక పూజలు జరుపుతున్నట్లు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు వారు వివరించారు. కార్యక్రమంలో పద్మారావు నగర్ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, బస్తీ వాసులు సంపత్, కుషాల్, సత్యనారాయణ, నర్సింగ్, కాంతారావు, దుర్గ, లక్ష్మమ్మ తదితరులు ఉన్నారు.