calender_icon.png 14 January, 2026 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా బయట పడండి..!

13-01-2026 10:54:22 PM

గుమ్మడిదల ఎస్ఐ లక్ష్మీకాంత్ రెడ్డి

గుమ్మడిదల: గుమ్మడిదల మండల కేంద్రం నల్లవల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదాల నుండి బయటపడి ప్రాణాలను రక్షించుకోవాలని అవగాహన సదస్సును మంగళవారం ఎస్సై లక్ష్మీకాంత్ రెడ్డి పోలీస్ బృందంతో నిర్వహించారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు, ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు ప్రతి పౌరుడూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రాష్ట్ర పోలీస్‌శాఖ చేపట్టిన ‘అరైవ్‌ అలైవ్‌' రోడ్డు సేఫ్టీ ప్రచార కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని  పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరితో రోడ్డు భద్రతా మండలల్లో తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టంచేశారు. ఈ సందర్బంగా ఎస్సై లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ... ఇక నుంచి హెల్మెట్‌ ధరించకపోవడం, సీటుబెల్ట్‌ వినియోగం లేకపోవడం, వాహనం నడుపుతూ మొబైల్‌ వినియోగం, మద్యం సేవించి డ్రైవింగ్‌ చేయడం, రాంగ్‌సైడ్‌ డ్రైవింగ్‌, హైవేలపై ఆటోల ఓవర్‌ లోడింగ్‌, మీటర్‌-యూనిఫాం నిబంధనలు ఉల్లంఘించడం, హైబీమ్‌ లైట్లు,ఎడమవైపు నుంచి ఓవర్‌ టేకింగ్‌పై ప్రత్యేకంగా దృష్టి చేస్తామని తెలిపారు.