30-06-2025 12:26:15 AM
50 ఏళ్ల పైబడ్డ విద్యార్థులు, 33 ఏళ్ల ఆ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
మహబూబాబాద్, జూన్ 29 (విజయ క్రాంతి): మహబూబాబాద్ పట్టణంలోని అరవింద విద్యాలయంలో 1991-92 సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు 33 ఏళ్ల అనంతరం ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. 50 ఏళ్ల పైబడ్డ వారంతా చిన్నతనంలో తాము ధరించిన స్కూల్ యూనిఫామ్ ధరించి చిన్నపిల్లల మారి, ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం విశేషంగా మారింది.
33 ఏళ్ల క్రితం విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యా యులను సత్కరించారు. ఈ సందర్భంగా అప్పటి హెడ్మాస్టర్ చంద్రదేవ్ మాట్లాడుతూ తమ వద్ద చదువుకున్న విద్యార్థులు ప్రయోజకులవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పూర్వ విద్యార్థులు గత స్మృతులను గుర్తుచేసుకొని, ప్రస్తుతం వారు స్థిరపడ్డ ఉద్యోగ ఉపాధి అవకాశా లను, కుటుంబ వివరాలను పరస్పరం పంచుకున్నారు.
భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి సమ్మేళనం నిర్వహించుకోవాలని, ఒకరికొకరు చేదోడు వాదోడుగా నిలవాలని నిర్ణయించారు. తమతో కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థులు, గురువులు అకాల మృత్యువాత పడగా వారికి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీరామ్, వీరస్వామి, లక్ష్మీనారాయణ, కుమార స్వామి, సలీం మహమ్మద్, ఫజల్, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.