30-06-2025 12:27:24 AM
మహబూబాబాద్, జూన్ 29 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో ఉన్న వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డిసిసిబి)శాఖ ను త్వరలో కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ఆవరణలోకి మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం బ్యాంకు నిర్వహిస్తున్న ప్రదేశం రోడ్డుకు లోపలికి ఉండడం వల్ల బ్యాంకు ఖాతాదారులకు అణువుగా లేదని యాజమాన్యం మార్కెట్ లో ఏర్పాటు చేస్తే రైతులకు, ఖాతాదారులకు అందుబాటులో ఉంటుందని మార్కెట్ పాలకమండలి దృష్టికి తెచ్చింది.
దీనితో మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి మార్కెట్ కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా బ్యాంకు నిర్వాహ కోసం అద్దెకు ఇవ్వడానికి అంగీకరించారు. పాలకమండలి నిర్ణయంతో గతంలో వ్యాపారులకు అద్దెకిచ్చే విధంగా రూపొందించిన వాణిజ్య సముదాయాన్ని బ్యాంకు కోసం చేర్పులు మార్పులు చేయిస్తున్నారు. సేఫ్ లాకర్ నిర్మాణం, సీలింగ్ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఫ్లోరింగ్, గ్రిల్స్ పనులు నిర్వహిస్తున్నారు.
కొద్ది రోజుల్లో పనులు పూర్తిచేసి డీసీసీ బ్యాంకును వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేయనున్నట్లు మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి తెలిపారు. మార్కెట్లో బ్యాంకు ఏర్పాటు చేయడం వల్ల మార్కెట్ కు అద్దె ద్వారా ఆదాయం లభించడం తోపాటు, రైతులకు, ఖాతాదారులకు అనువుగా ఉంటుందని చెప్పారు.