27 July, 2026 | 6:34 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

నారపల్లిలో టిప్పర్ ఢీకొని ఏఎస్ఐ మృతి

22-12-2025 03:50 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): టిప్పర్ డికోట్టడం తో అక్కడికక్కడే ఏఎస్ఐ మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్(Medipally Police Station) పరిధిలో చోటు చేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... అన్నోజిగూడ కు చెందిన జగ్గాని రఘుపతి యాదవ్ (59) ఖైరతాబాద్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ గా పనిచేస్తున్నాడు. సోమవారం తన విధులు ముగించుకొని తిరిగి ద్విచక్ర వాహనం పై వస్తుండగా  ఉప్పల్ టు వరంగల్ హైవే నారపల్లి మసీదు దగ్గర వెనుక నుండి వచ్చిన టిప్పర్ డీ ఢీకొట్టడం తో బైక్ పై నుండి లారీ  క్రింద పడడంతో అతని తల మీద నుండి టైర్ పోవడంతో  అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.టిప్పర్ ను సీజ్ చేసి డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.