14 May, 2026 | 5:56 PM

రైతు కుటుంబానికి సాయం

14-05-2026 05:02 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా లక్ష్మణ చందా మండలం కనకాపూర్ గ్రామానికి చెందిన రైతు గంగన్న మొక్కజొన్న నిప్పు అంటుకొని మరణించడంతో ఆ కుటుంబానికి పదివేల ఆర్థిక సాయం అందించారు. నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్ భీమ్ రెడ్డి ఈ సాయాన్ని అందించారు. త్వరలో రైతు బీమా ఇన్సూరెన్స్ అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ రామ్ రెడ్డి నాయకులు నరేష్ రెడ్డి సర్పంచ్ వెంకటలక్ష్మి తదితరులు ఉన్నారు