28-06-2025 01:35:36 AM
- గత ప్రభుత్వ హయాంలో నన్ను, నా కుటుంబాన్ని వేధించారు
- సిట్ ముందు వాంగ్మూలం ఇచ్చిన బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి
- ఆస్పత్రిలో ఎంపీ రఘునందన్రావు వాంగ్మూలం
హైదరాబాద్ సిటీబ్యూ రో, జూన్ 27 (విజయక్రాం తి): ‘ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైన వ్యక్తులు మాజీసీఎం కేసీఆర్, మాజీమంత్రి కేటీఆర్ను అరెస్ట్ చెసి వారి పై చర్యలు తీసుకోవాలి. బీ ఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాపై నిఘా పెట్టా gరు. ముఖ్యంగా మునుగోడు, దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల సమయంలో నా ఫోన్ను ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు ఆధారాలు చూపించారు..’ అని బీజేపీ నేత, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి ఆరోపించారు.
రాష్ర్టవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవా రం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఎదుట చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, కాంగ్రెస్ లీగల్ సెల్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు దేవరాజుగౌడ్, ఆంధ్రజ్యోతి ఎండీ వే మూరి రాధాకృష్ణ హాజరై తమ వాంగ్మూలాలను నమోదు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభు త్వం తమపై నిఘా పెట్టి, రాజకీయంగా దెబ్బతీసేందుకు, బెదిరింపులకు పాల్పడిందని బాధితులు సిట్కు వివరించారు.
సిట్ విచారణ అనంతరం ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రావడంతో, అభద్రతాభావంతోనే కేసీఆర్ సర్కార్ ఈ అక్రమాలకు పాల్పడిందన్నారు. తన ఫోన్కు రికార్డింగ్ సాధ్యం కాకపోవడంతో లైవ్ ట్యాపింగ్ చేశారని, అప్పటి డీజీపీ మహేందర్రెడ్డి పర్యవేక్షణలోనే ఇదంతా జరిగింద న్నా రు.
‘నా స్నేహితుడు కొనుగోలు చేసిన రూ. 72 కోట్ల బంగారం, డబ్బును పోలీసులు పట్టుకుని, అది నా డబ్బేనంటూ నన్ను బెదిరించారు. నేను అమ్మిన భూమికి డబ్బు లిచ్చిన వ్యక్తిని కూడా హింసించి, అతడితో బలవంతంగా రూ.13కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనిపించారు. ఈటల రాజేం దర్కు నేను డబ్బులిచ్చినట్లు తప్పుడు ప్రచా రం చేసి, నాపై నిందలు మోపారు. నేను ఆయనకు మద్దతిచ్చాను కానీ ఆర్థిక సహా యం చేయలేదు..’ అని స్పష్టం చేశారు.
‘కేవ లం నన్నే కాదు, నా భార్య సంగీత ఫోన్ను సైతం ట్యాపింగ్ చేసి వేధించారు. ఎలాంటి వారెంట్ లేకుండా నా ఆఫీసులోకి దౌర్జన్యం గా ప్రవేశించి నిఘా పెట్టారు’ అని ఆయన మండిపడ్డారు. ఈ అక్రమాలపై తాను ఫిర్యా దు చేస్తే, తిరిగి తనపైనే నాన్-బెయిలబుల్ కే సు పెట్టి ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హోం సెక్రటరీ అనుమతి లేకుండా చట్టవిరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిన ప్రభాకర్రావుతో పాటు, ఈ కుట్ర లో భాగమైన ప్రతి ఒక్కరినీ కఠినంగా శిక్షించాలని ఈ అంశాన్ని పార్లమెంటులో లేవ నెత్తుతానని కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు.
ఆస్పత్రిలో రఘునందన్రావు వాంగ్మూలం..
బీజేపీ నేత, మెదక్ ఎంపీ రఘునందన్రావు తాజాగా కాలి గాయంతో కావడంతో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రఘునందన్ రావు దగ్గరకు వెళ్లిన సిట్ అధికారులు ఆయన స్టేట్ మెంట్ రికార్డ్ చేసుకున్నారు. ఇ దే కేసులో భాగంగా ఏబీఎన్ -ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కూడా సిట్ ఎదు ట హాజరయ్యారు. సిట్ అధికారులు సుమా రు రెండు గంటల పాటు ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.
కాంగ్రెస్ నేత దేవరా జుగౌడ్ మాట్లాడుతూ.. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి నుంచి నాటి పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పోటీ చేసినప్పుడు, ఆయన వ్యూహాలు తెలుసుకునేందుకే తన ఫోన్ను ట్యాప్ చేశారని ఆరోపించారు. ‘నా ఇంట్లో అక్రమంగా సోదాలు చేశారు.. నాతో పాటు నా కుటుంబ సభ్యులు, అనుచరుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసి తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశారు..’అని ఆయన మండిపడ్డారు. ట్యాపింగ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.