calender_icon.png 14 June, 2025 | 7:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అబద్ధపు ప్రకటనలతో ఏమార్చే ప్రయత్నం

10-10-2024 12:50:42 AM

మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్, అక్టోబర్ 9(విజయక్రాంతి): ఉద్యోగాల భర్తీ విష యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అసత్యాలను ప్రచారం చేస్తోందని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. అబద్ధపు ప్రకటనలతో ఏమార్చే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశా రు. కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగుల కలలు కల్లలయ్యాయన్నారు.

10 నెల ల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క నోటిఫికేషన్ ద్వారా కూడా నియామక ప్రక్రియను పూర్తి చేయలే కపోయిందన్నారు. బీఆర్‌ఎస్ ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌కి 6,000 పోస్టు లు జోడించి కొత్త నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. కేవలం అపాయింట్‌మెంట్ ఆర్డర్లు మాత్రమే రేవంత్ రెడ్డి ఇచ్చారని మండిపడ్డారు.