03-02-2026 01:53:04 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా జరిగినట్లు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. తొలి రోజు పరీక్షలకు అభ్యర్థులు 95.72 శాతం మంది హాజరైనట్లు పేర్కొన్నారు. 1,41,548 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, 6,325 మంది గైర్హాజరైనట్లు తెలిపారు.