12-06-2025 12:28:11 AM
10 కే రిలే వాక్ నిర్వహణ: జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, జూన్ 11(విజయ క్రాంతి): ప్రభుత్వ బడిబాట విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పూల బాట అని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. బుధవారం బడిబాట కార్యక్రమంలో భాగంగా మంభోజిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నుండి, ఆవుసులపల్లి ప్రాథమికొన్నత పాఠశాల వరకు (10 కిలోమీటర్ల)..10 కె రిలే వాకింగ్ సంబంధిత అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ మహేందర్, మెదక్ ఆర్ డి ఓ రమాదేవి, జిల్లా విద్యాశాఖ అధికారి రాధా కిషన్, సైన్స్ అధికారి రాజిరెడ్డి, యువజన క్రీడల నిర్వహణ అధికారి, అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శన్ మూర్తి,సంబంధిత ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, మెదక్ పట్టణ యువత , పోలీస్ యంత్రాంగంతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ బడిబాట కార్యక్రమం 10 కె రిలే వాక్ కార్యక్రమాన్ని మంబోజిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నుండి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జెండా ఊపి ప్రారంభించారు.
ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చేపట్టిన బడిబాట కార్యక్రమం, 10 కె రిలే వాక్ ఉత్సాహభరితంగా జరిగింది. కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా నిష్ణాతులైన ఉపాధ్యాయులతో సరికొత్త సాంకేతిక విద్యా విధానం ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్నామని తెలిపారు. అనంతరం హౌసులపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో సమావేశం నిర్వహించి బడిబాట కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ సుదీర్ఘంగా వివరించి. విద్యార్థుల నమోదును పత్రాలను కలెక్టర్ స్వయంగా అందించారు. ఈ కార్యక్రమంలో ఇతర జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు, పీఈటీలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.