28-05-2025 10:52:09 PM
నడిగూడెం: 2024-25 విద్యా సంవత్సరం పదవ తరగతిలో, ఇంటర్మీడియట్లో వార్షిక పరీక్షల్లో నూరు శాతం ఫలితాలు సాధించినందుకు గాను నడిగూడెం సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ చింతలపాటి వాణి బుధవారం హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర మంత్రులు, గురుకుల విద్యాలయాల సంస్థ అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలలు 238 ఉండగా అందులో 14 పాఠశాలలను ఎంపిక చేశారు. అందులో నడిగూడెం గురుకుల పాఠశాల కూడా ఎంపిక కావడం విశేషం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవార్డును అందజేసి గురుకుల సొసైటీ కార్యదర్శి, ప్రిన్సిపాల్ ను అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇదే విధమైన ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. గురుకుల విద్యాలయాల అభివృద్ధికి కృషి చేయాలని నాణ్యమైన విద్య అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ గడ్డం శివప్రసాద్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి అలుగు వర్షిని, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, గురుకుల సొసైటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.