28-05-2025 10:56:27 PM
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్..
నిర్మల్ (విజయక్రాంతి): భూ సర్వేల నిర్వహణలో సర్వేయర్లది ముఖ్యమైన పాత్ర అని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) అన్నారు. లైసెన్స్ సర్వేయర్లకు బుధవారం సాయంత్రం కలెక్టరేట్ లోని తన చాంబర్లో సర్వే కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారికి కీలక సూచనలు చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని అమలు చేస్తుందని అన్నారు. ఈ చట్టాన్ని అనుసరించి భూ సమస్యలను సర్వేయర్లు పరిష్కరించాలన్నారు.
శిక్షణ కాలంలో అధికారుల నుంచి అన్ని విషయాలను సమగ్రంగా తెలుసుకొని క్షేత్రస్థాయిలో భూ సర్వేలు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. కాగా జిల్లాలో 113 మంది లైసెన్స్ సర్వేయర్లకు 50 రోజులపాటు ఉదయం, సాయంత్రం రెండు పూటలా శిక్షణ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడి ల్యాండ్ సర్వేయర్ సుదర్శన్, లైసెన్స్ సర్వేయర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
రాజీవ్ యువ వికాసం పథకం పారదర్శకం
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రాజు యువ వికాసం పథకం ద్వారా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాజు యువ వికాసం పథకంపై నిర్వహించిన వీడియో లబ్ధిదారుల ఎంపిక పక్కలపై సూచనలు సలహాలు చేసినట్టు తెలిపారు.
జూన్ 2న నిర్మల్ జిల్లాలో ఎంపికైన లబ్ధిదారులకు రుణ అర్హత పత్రాలను అందించడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల ద్వారా వచ్చిన దరఖాస్తులు పరిశీలన తదితర వివరాలు అడిగి ఎంపిక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, బీసీ సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి మోహన్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.