25-06-2025 12:15:48 AM
మునిపల్లి, జూన్ 24 : మండలంలోని బుధేరా గ్రామంలోని ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు డ్రగ్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలని ట్రైనీ ఎస్.ఐ హారిక అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ చాలామంది విద్యార్థులు డ్రగ్స్ కి బానిసై తమ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారని, డ్రగ్స్ పట్ల అవగాహన కలిగి ఉంటే వాటికి దూరంగా ఉండొచ్చన్నారు. సరైన జీవిత లక్ష్యాన్ని ఎంచుకొని బాగా చదువుకొని మంచి ఉద్యోగం సాధించాలని సూచించారు.