26-06-2025 12:00:00 AM
మంచిర్యాల, జూన్ 25 (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల స్వయం సహాయక సం ఘాల ఔత్సాహిక మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో అవగా హన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్ అన్నా రు.
బుధవారం కలెక్టరేట్లో ప్రపంచ బ్యాంక్ నిధులతో భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ర్యాంప్ (రైసింగ్ అండ్ యాక్సలెరేటింగ్ ఎం.ఎ స్.ఎం.ఈ. పెర్ఫారెన్స్)లో భాగంగా ప్రభుత్వ పరిశ్రమల శాఖ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థల సంయుక్తంగా అలీప్ (అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్రేనియర్ ఆఫ్ ఇండియా) సం స్థ సారథ్యంలో ఒక్క రోజు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మాట్లాడుతూ ఔత్సాహిక మహిళలకు అవగాహన సదస్సు అనంతరం 15 రోజుల పరిశ్రమ నిర్వహణ, ఉత్పత్తుల మార్కెటింగ్ మెళకువలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు.
ఆచరణీయ పరిశ్రమలకు ఉద్యమ్ రిజిస్ట్రేషన్, బ్యాంకుల ద్వారా ఋణ సహాయం అందించ డం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జి.ఎం., అలీప్ సంస్థ అధ్యక్షులు రమాదేవి, ప్రాజెక్టు అధికారి ఖాసీం మహమ్మద్, ప్రాజెక్టు సమన్వయకర్త వంశీ, అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి, డి.పి.ఎం., ఎ.పి.ఎం. జీవన్ తదితరులు పాల్గొన్నారు.