27 July, 2026 | 8:12 PM

Breaking News

ఉరుమడ్ల మహిళల సత్తా.. రాష్ట్ర స్థాయి త్రోబాల్ పోటీలకు అర్హత.   •   విత్తనాల మేళాను సద్వినియోగం చేసుకోండి   •   తరుగు పేరుతో రూ.71 లక్షల అవినీతి   •   మండల సమావేశాన్ని బహిష్కరించిన ఫీల్డ్ అసిస్టెంట్లు   •   దోరకుంటలో వన మహోత్సవం   •   చిన్నకాపర్తి చెరువులకు పిలాయిపల్లి కాలువ నీరు అందించాలి   •   ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకం   •   మూడేళ్లుగా కూలిన హాస్టల్ గోడ.. పునర్నిర్మించాలని పీడీఎస్‌యూ డిమాండ్   •   దళితుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి   •   సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా చేతికి రీసెంట్ బ్లాక్‌బస్టర్ 'చెన్నై లవ్ స్టోరీ' డిజిటల్, శాటిలైట్ హక్కులు   •  

అంటువ్యాధులు సోకకుండా అవగాహన

02-07-2025 01:11 AM

తూప్రాన్, జులై 1 : తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని 4వ వార్డులో తడి పొడి చెత్త వేరు చేయు విధానంపై అవగాహణ సదస్సును మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. వర్షాకాలంలో అంటు వ్యాధులు సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించాలని, ప్లాస్టిక్ వాడడం వలన కలిగే అనర్దాల గురించి ప్రజలకు వివరించడం జరిగింది.

మునిసిపల్ కార్యాలయంలో భర్దన్ బ్యాంక్, మెప్మా సహకారంతో నిర్వ హించడం జరిగింది. పలు వార్డులలో వర్షపు నీరు గుంతలలో నిల్వకుండ మొరం వేయడం జరిగింది. మురికి కాలువలలో చెత్త చెదారం, ప్లాస్టిక్ చేరువులోకి పోకుండా జాలి వేయడం జరిగింది. రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలు తొలగించడం జరిగింది. 12వ వార్డులో పబ్లిక్ టాయిలెట్స్ తనికి చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.