17 April, 2026 | 2:52 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ఘనంగా అయ్యప్పస్వామి మహా పడిపూజ మహోత్సవం

18-11-2025 12:30 AM

హనుమకొండ టౌన్, నవంబర్ 17 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా భీమారం దుర్గామాత ఆలయంలో సోమవారం అయ్యప్ప స్వామి మహాపడిపూజ మహోత్సవ కార్యక్రమాన్ని ఆరే రవీందర్ రెడ్డి- పద్మ దంపతులు, కమలాపురం అయ్యప్ప స్వామి ఆలయ ప్రధాన అర్చకులు జానకి రామయ్య, అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ జాతీయ నిర్వహకులు విలాసారపు వీరస్వామి చేతుల మీదుగా అంగర వైభవంగా నిర్వహించారు. 18 మెట్లను పూలతో అలంకరించి కర్పూర దీపాలు వెలిగించి పడి పూజ చేశారు. కన్నులపండువగా మహా పడిపూజ జరిగింది.

భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయ్యప్ప కీర్తనలతో బీమారం ప్రాంతమంతా మార్మోగింది. అనంతరం అయ్యప్ప మాల ధరించిన స్వాములకు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అరె రవీందర్ రెడ్డి గురుస్వామి మాట్లాడుతూ 2025 లో దుర్గామాత ఆలయంలో తన చేతుల మీదుగా మొదటి అయ్యప్ప స్వామి మహా పడిపూజ నిర్వహించడం ఆనందంగా ఉందని అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నారు.