16 March, 2026 | 11:03 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

బాబాయ్ నిలిపిన ప్రాణం

07-12-2025 12:00 AM
  1. తన అన్న కొడుకు, 25 ఏళ్ల యువకుడికి కిడ్నీ దానం
  2. ఏఐఎన్యూ ఆస్పత్రిలో విజయవంతంగా మార్పిడి

హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్యూ) ఆస్పత్రిలో 25 ఏళ్ల యువకుడికి ఆయన చిన్నాన్న ఇచ్చిన కిడ్నీని విజయవంతంగా మార్చారు. తల్లిదండ్రుల్లో ఒకరికి పక్షవాతం, మరొకరికి గుండెకు బైపాస్ శస్త్రచికిత్స జరిగాయి. కుమారుడికి వారిద్దరూ కిడ్నీ ఇవ్వలే ని పరిస్థితి. అలాంటి తరుణంలో ఆయన చిన్నాన్న ముందుకొచ్చారు.

చిన్నప్పటి నుంచి తన కళ్లముందే పెరిగిన ఆ యువకుడికి తాను కిడ్నీ ఇస్తానన్నారు.  కోనసీమ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల యువకుడు.. బీటెక్ చదివి, హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. రెండేళ్ల క్రితం ఉన్న ట్టుండి అతడికి తలనొప్పి, వాంతులు తరచు అవ్వడం మొదలైంది. ఏంటా అని వైద్యులకు చూపించుకుంటే సీరం క్రియాటినైన్ బాగా పెరిగిందని రక్తపరీక్షల్లో తేలింది. మరిన్ని పరీక్షల అనంతరం.. అతడికి దీర్ఘకాల కిడ్నీ వ్యాధి (సీకేడీ) ఉందని తెలిసింది.

దాంతో అతడు నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్యూ) వైద్యులను సంప్రదిం చాడు. అతడికి చికిత్స అందించి, కిడ్నీ మార్పి డి చేసిన సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గుండ్లపల్లి ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు. ‘యువకుడి చిన్నాన్న నుంచి లాపరోస్కొపిక్ పద్ధతిలో కిడ్నీ సేకరించి, దాన్ని యువకుడికి అమర్చాం అని డాక్టర్ శ్రీకాంత్ వివరించారు.