30 August, 2026 | 10:53 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

నేడు విద్యాసంస్థల బంద్

04-07-2024 01:45 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 3 (విజయక్రాంతి) : నీట్‌ను రద్దు చేయాలని, లీక్‌కు కారణమైన వారిని శిక్షించాలనే డిమాండ్‌తో నేడు దేశవ్యాప్తంగా జరిగే విద్యాసంస్థల బంద్ కు అన్ని విద్యాసంస్థలు సహకరించాలని, బంద్‌ను విజయవంతం చేయా లని విద్యార్థి, యువజన సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. బుధవా రం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎన్‌ఎస్‌యూఐ, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్, వీజేఎస్, పీవైఎల్, డీవైఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్, వైజేఎస్ విద్యార్థి సంఘాల జిల్లా నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నీట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. ఎన్‌టీఏ చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం బంద్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.