calender_icon.png 23 January, 2026 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరల్డ్‌కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్

23-01-2026 12:25:52 AM

  1. భారత్‌లో ఆడబోమని ప్రకటన
  2. స్కాట్లాండ్‌కు చోటు దక్కే ఛాన్స్
  3. ఐసీసీపై బీసీబీ విమర్శలు

ఢాకా, జనవరి 22 : ఊహించిందే జరిగింది.. భారత్, శ్రీలంక వేదికలుగా వచ్చే నెలలో జరగనున్న ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకుంది. భారత్ లో మ్యాచ్‌లు ఆడేది లేదంటూ ప్రపంచకప్ ను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. 24 గంటల్లోగా తేల్చుకోవాలంటూ ఐసీసీ బుధవారం విధించిన డెడ్‌లైన్ నేపథ్యంలో బం గ్లాదేశ్ క్రికెట్ బోర్డు తర్జన భర్జన పడింది. తమ ప్రభుత్వంతో సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం తమ ప్లేయర్ల అభిప్రాయాలను తీసుకుంది.

చివరికి ప్రభుత్వం మాటకే తలొగ్గుతూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు టీ20 ప్రపం చకప్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించింది. బంగ్లాలో హిందులపై దాడులు, హ త్యల సంఘటనలతోనే అసలు ఈ వివాదం మొదలైంది. దీనికి నిరసనగా ఐపీఎల్‌లో బంగ్లా ప్లేయర్స్‌ను ఆడనివ్వొద్దంటూ డి మాండ్ రావడంతో బీసీసీఐ ముస్తాఫిజుర్ రహమాన్‌ను తప్పించింది.

దీనిని అవమానంగా భావించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రతీ కార చర్యలకు దిగింది. బీసీబీ పేరుతో తెరవెనుక డ్రామా అంతా బంగ్లా ప్రభుత్వమే క్రి యేట్ చేసింది. అటు సామరస్యంగా సమస్యను పరిష్కరించే ఉద్దేశంతో రంగంలోకి దిగిన ఐసీసీ బంగ్లా బోర్డుకు నచ్చజెప్పేందు కు ప్రయత్నించి విఫలమైంది. 

భారత్లో భద్రతా ఇబ్బందులు ఉన్నాయంటూ తమ వరల్ కప్ మ్యాచ్‌లను శ్రీ లంకకు మార్చాలని బీసీబీ, ఐసీసీకి రిక్వెస్ట్ పెట్టింది. దీనిపై ఐసీసీ అత్యవసరంగా సమావేశమై భద్రతా పరమైన సమస్యలు లేవని తేల్చిచెప్పింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వేదిక మార్చే సమస్యే లేదని స్పష్టం చేసింది. షె డ్యూల్ పరంగా, లాజిస్టిక్స్ పరంగా చాలా ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంది. దీంతో పునరాలోచనలో పడిన బంగ్లాదేశ్ క్రికెట్ తమ గ్రూప్ నైనా మార్చమని కోరిం ది.

ఐర్లాండ్ తో గ్రూప్ మార్చుకుంటే బంగ్లా తన లీగ్ మ్యాచ్ లన్నింటినీ శ్రీలంకలో ఆడే ది. అయితే ఇటు ఐసీసీ, అటు ఐర్లాండ్ కూడా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తిని నిర్మొహమాటంగా తిరస్కరించింది. ఈ పరిణామ లతో విసుగెత్తిన ఐసీసీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు 24 గంటల గడువు విధించింది. దీనితో హడావుడిగా ప్రభుత్వం, ఆటగాళ్లతో సమావేశమై తమ నిర్ణయాన్ని ప్రకటించింది.

ఇప్పుడు మెగాటోర్నీ నుంచి బంగ్లాదేశ్ తప్పుకోవడంతో మరో జట్టుగా స్కాట్లాండ్ ను తీసుకోనున్నట్టు సమాచారం. అయితే తమ నిర్ణయం ప్రకటించినప్పుడు బంగ్లా క్రికెట్ బోర్డు ఐసీసీపై విమర్శలు గుప్పించింది. ఐసీ సీ వైఫల్యం కారణంగానే సమస్య పరిష్కారం కాలేదంటూ బంగ్లా ప్రభుత్వ సలహాదారు అమీనుల్ ఇస్లాం విమర్శించారు.