17 April, 2026 | 3:17 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

కోదాడలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచ్ ప్రారంభం

08-04-2025 01:09 AM

సూర్యాపేట, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా కోదాడలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర  బ్రాంచ్ ను (బివోఎం) సోమవారం  హైదరాబాద్ జోన్  జోనల్ మేనేజర్ ఎ ఈ ప్రసాద్, డిప్యూటీ జోనల్ మేనేజర్ హరి, కోదాడ బ్రాంచ్ ఉద్యోగులు, కస్టమర్ల సమక్షంలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా జోనల్ మేనేజర్ మాట్లాడుతూ ప్రజల అన్ని బ్యాంకింగ్, ఆర్థిక అవసరాలను తీర్చడానికి కోదాడలో  బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర యొక్క అత్యాధునిక కొత్త శాఖ ప్రారంబించామని, ఇది కస్టమర్లకు సహయపడుతుందన్నారు. 

డిప్యూటీ జోనల్ మేనేజర్ మాట్లాడుతూ  ఇది కస్టమర్ యొక్క బ్యాంకింగ్ అవసరాలకు ఒక స్టాప్ షాప్ అని  ప్రస్తుతం భారతదేశంలోని 28 రాష్ట్రాలు మరియు 5 కేంద్ర పాలిత ప్రాంతాలలో 2400 కంటే ఎక్కువ శాఖలతో 30 మిలియన్ల కస్టమర్లకు సేవలందిస్తోందని తెలిపారు.