calender_icon.png 5 June, 2025 | 8:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాతవాహన ‘లా కాలేజీ’కి బార్ కౌన్సిల్ ఆమోదం

15-05-2025 02:30:36 AM

ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభం

కరీంనగర్, మే14 (విజయక్రాంతి): కరీంనగర్‌లోని శాతవాహన విశ్వ విద్యాలయం పరిధిలో లా కాలేజీ (న్యాయ కళాశాల) ను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయగా అనుమతి కోసం కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన క్రుషి ఫలించింది.  లా కళాశాల అనుమతికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఈ విద్యా సంవత్సరం నుండే అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి.

120 మంది విద్యార్థులతో(రెండు సెక్షన్లు) ఎల్‌ఎల్ బి కోర్సు ప్రారంభం కానుంది. శాతవాహన వర్శిటీలో లా కళాశాల మంజూరు చేయాలని కోరుతూ వర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్  ఉమేశ్ కుమార్ గతంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను కోరారు. ఈ నేపథ్యంలో గత నెల మొదటి వారంలో ప్రొఫెసర్ ఉమేశ్ కుమార్, మాజీ మేయర్ సునీల్ రావును వెంటబెట్టుకుని బండి సంజయ్ న్యూఢిల్లీలోని  కేంద్ర న్యాయశాఖ మంత్రిత్వ కార్యాలయానికి వెళ్లారు.

సంబంధిత శాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ ను కలిసి లా కాలేజీని మంజూరు చేయడంతోపాటు ఈ ఏడాది నుండే అడ్మిషన్లు ప్రారంభమయ్యేలా చూడాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. మొత్తం 120 మందితో (రెండు సెక్షన్లతో కలిపి) లా కాలేజీని నడిపేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ విషయంపై వర్చువల్ గా శాతవాహన వర్శిటీని వర్చువల్ గా తనఖీ చేయడంతోపాటు వివరణలతో కూడిన నివేదిక కోరిన విషయాన్ని కూడా ఈ సందర్బంగా బండి సంజయ్ గుర్తు చేశారు. బార్ కౌన్సిల్ ఆదేశాల మేరకు వివరణాత్మక నివేదికను పంపినట్లు తెలిపారు.  కాలేజీ అనుమతికి ఆమోదం తెలపడంతోపాటు వచ్చే విద్యా సంవత్సరం నుండే ఎల్ ఎల్ బీ కోర్సును ప్రారంభానికి అనుమతి ఇవ్వడం గమనార్హం. 

మంత్రులకు కృతజ్ఞతలు

మూడేళ్ల లా డిగ్రీకి అనుమతులు లభించింది. 2025-26 అకాడమిక్ ఇయర్ నుండి తరగతులు ప్రారంభంఅవుతాయి., కొత్త కోర్సుల మౌలిక ఏర్పాటులో విశ్వవి ద్యాలయం ముందుకు సాగు తుంది. తొడ్పా టు అందించిన రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి, జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్ కి,  కేంద్ర మంత్రి బండి సంజయకుమార్‌కి   కేంద్ర  చట్ట,న్యాయశాఖ మంత్రి  అర్జున్ రామ్ మేఘ్వాల్ కి  కృతజ్ఞతలు

  1. ఉపకులపతి ఆచార్య యు ఉమేష్ కుమార్
  2. బండి సంజయ్ కృషి వల్ల కళాశాలకు అనుమతి

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్  కృషి ఫలితంగానే కరీం నగర్ శాతవాహన యూనివర్సిటీలో ‘ లా‘ కళాశాలకు అనుమతి  లభించింది.  కరీంనగర్ జిల్లాకు లా కళాశాలను కేంద్రం నుంచి అనతి కాలంలో  మంజూరు చేయించడంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్  చొరవ చూపించారు.

 మాజీ మేయర్ సునీల్ రావు