4 April, 2026 | 2:56 PM

Breaking News

గజ్వేల్‌లో పొలిటికల్ హైటెన్షన్.. KCR క్యాంప్ ఆఫీసులో రేవంత్ రెడ్డి ఫోటో   •   వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం   •   యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •   హాస్పిటల్ ఇన్ఫెక్షన్ల నివారణపై అవగాహన కార్యక్రమం   •  

గాలింపు చర్యలు వేగవంతం చేయండి

01-10-2025 08:28 AM

 వాగులో కొట్టుకుపోయిన మంగలి రమేష్

దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి 

 కౌకుంట్ల : మండల కేంద్రం నుండి ఇస్రంపల్లికి వెళ్లే రహదారిపైగల వాగుపై మంగలి రమేష్ దాటుతున్న సమయంలో వరద ఉధృతికి ప్రమాదవ శాత్తూ కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి(Devarakadra MLA G Madhusudan Reddy) వెంటనే ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఎస్డిఆర్ఎఫ్  సిబ్బందితో మాట్లాడి గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. వరద ఉధృతి ఎక్కువ ఉన్న సమయంలో ప్రజలు ఎవ్వరు కూడా వాగులను దాటాలని చూడకూడదని ఇప్పటికే పలుమార్లు చెప్పడం జరిగిందన్నారు.

ఈ విషయంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎప్పుడూ ఎలాంటి ఇబ్బందులు ఉన్న తక్షణమే అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సమాచారం అందించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సమాచారం అందించిన వెను వెంటనే అధికారులకు తమకు సమాచారం అందిస్తారని వెంటనే అధికారులకు తమకు సమాచారం అందిస్తారని పేర్కొన్నారు. రమేష్ ఆచూకీ తెలుసుకునేందుకు ప్రత్యేకంగా నిగా ఉంచి గాలింపు చర్యలు మరింత వేగంగా చేయాలని ఆదేశించారు. కురుస్తున్న వర్షాల సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.