16-02-2026 02:57:30 PM
ధర్మపురి,(విజయక్రాంతి): వెల్గటూర్ మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి మండల కేంద్రానికి చెందిన బట్టు భూమయ్య గౌడ్ తమ యొక్క ఉదారతను చాటుకున్నారు. తమ కులదైవమైన శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా అత్యంత చొరవ తీసుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయంలో అధునాతనమైన రూ. 75000/- విలువగల మార్బుల్స్ (పాలరాయి) వేయించి, ఆలయ సుందరీకరణకు తన వంతు సహకారాన్ని అందించారు. ఆలయాల అభివృద్ధిలో భాగస్వాములు కావడం పూర్వజన్మ సుకృతమని, భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలనే ఉద్దేశంతోనే పాలరాయి వేయించినట్లు బట్టు భూమయ్య తెలిపారు. బట్టు భూమయ్య సేవల పట్ల గౌడ సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.