22 May, 2026 | 10:13 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

ఆలయం పట్ల ఉదారత చాటిన బట్టు భూమయ్య

16-02-2026 02:57 PM

ధర్మపురి,(విజయక్రాంతి): వెల్గటూర్ మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి మండల కేంద్రానికి చెందిన బట్టు భూమయ్య గౌడ్ తమ యొక్క ఉదారతను చాటుకున్నారు. తమ కులదైవమైన శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా అత్యంత చొరవ తీసుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయంలో అధునాతనమైన రూ. 75000/- విలువగల మార్బుల్స్ (పాలరాయి) వేయించి, ఆలయ సుందరీకరణకు తన వంతు సహకారాన్ని అందించారు. ఆలయాల అభివృద్ధిలో భాగస్వాములు కావడం పూర్వజన్మ సుకృతమని, భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలనే ఉద్దేశంతోనే పాలరాయి వేయించినట్లు బట్టు భూమయ్య తెలిపారు. బట్టు భూమయ్య సేవల పట్ల గౌడ సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.